జ‌స్టిస్ చంద్రు అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నారు : ఎంపీ రాఘురామ‌

-

రాష్ట్ర శాస‌న స‌భ‌లు రాజ్యాంగానికి వ్య‌తిరేకం గా చ‌ట్టాలు చేసినప్పుడు కోర్టులు అడ్డుకుంటాయ‌ని.. వాటిని కొట్టివేస్తాయ‌ని ఎంపీ రాఘురామ కృష్ణం రాజు అన్నారు. దీని పై అవ‌గాహ‌న లేకుండా జ‌స్టిస్ చంద్రు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. జ‌స్టిస్ చంద్రు తో ఇలా మట్లాడించింది.. సీఎం జ‌గ‌నే అని ఆరోపించారు. ఏపీ న్యాయ వ్య‌వ‌స్థ స‌క్ర‌మం గా న‌డుస్తుంద‌ని అని అన్నారు.

కానీ ఏపీ న్యాయ వ్య‌వ‌స్థ పై జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్య‌లు బాధ క‌లిగించాయ‌ని అన్నారు. జ‌గ‌న్ వ‌ల్లే గొప్ప స్థాయి లో ఉన్న జ‌స్టిస్ చంద్రు ఇలా మ‌ట్లాడార‌ని అన్నారు. అంత గొప్ప వ్య‌క్తి తో ఇలా మట్లాడించి సీఎం జ‌గ‌న్ కు హ్యాట్సాఫ్ అని విమ‌ర్శించారు. కాగ ఇటీవ‌ల ఏపీ న్యాయ వ్య‌వ‌స్థ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్య‌ర్థు ల‌తో.. శ‌త్రువ‌ల తో కాకుండా కోర్టు ల‌తో పోరాటం చేసే విధం గా ఏపీ హై కోర్టు ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news