కాంగ్రెస్‌కు కీలక నేతలు రాజీనామా.. పొన్నం కూడా గుడ్‌బై

-

కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలందరూ రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం, ఆర్టీఐ విభాగానికి బాధ్యత వహిస్తున్న వివేక్ తన్ఖా పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాకు చెందిన పలువురు కీలక నేతలు కూడా రాజీనామాలు చేశారు.

ఇలా కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతుండగా.. తెలంగాణ నుంచి కరీంనగర్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. ఆయన ఎందుకు తన పదవికి రాజీనామా చేసింది తెలియనప్పటికీ.. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించినట్లు తెలుస్తోంది. దేశం మొత్తం మీద 140 మంది కాంగ్రెస్ నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version