కేసీఆర్ కు ఝలక్.. మళ్లీ ‘సాలు దొర.. సెలవు దొర’ బోర్డు ప్రత్యక్షం

-

టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మరో ఝలక్ ఇచ్చింది. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా.. తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీఆర్ఎస్ పై మళ్లీ బీజేపీ తన వార్ షురూ చేసింది. ఇందులో భాగంగానే.. హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ‘సాలు దొర.. సెలవు దొర’ అనే డిజిటల్ బోర్డు మళ్లీ ప్రత్యక్షమైంది.

ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సూచిస్తూ.. బీజేపీ గతంలో కౌంట్ ​డౌన్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్​ బోర్డుపై రాజకీయ దుమారం రేగింది. జీహెచ్ఎంసీ కూడా బోర్డు ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులు తొలగించమని చెప్పడంతో.. బీజేపీ నేతలు కార్యాలయం వద్ద బోర్డును తొలగించారు.

తాజాగా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. మళ్లీ పార్టీ కార్యాలయం అవరణలో ‘సాలు దొర సెలవు దొర’ డిజిటల్ బోర్డును ప్రారంభించింది. సీఎం కేసీఆర్ గద్దె దిగే వరకు ఈ కౌంట్ డౌన్ బోర్డు కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news