సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ; కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపిస్తున్నామని.. దీని ఏర్పాటు ఎఫ్ జి వి కంపెనీ ముందుకు వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యం లోనే ఎఫ్ జి వి కంపెనీతో సమావేశం అయ్యారు కేటీఆర్‌. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందని మంత్రి కే. తారకరామారావు అన్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు. కంపెనీకి చెందిన సత్యనారాయణ ఆయిల్ఫామ్ పంటలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఆయిల్ఫామ్ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారడంతో పాటు, వేలాది మందికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల లో  ఉపాధి లభిస్తుందన్నారు.

ఆయిల్ ఫామ్ కి సుప్రసిద్ధమైన మలేషియా దేశంలో తమ కంపెనీ చేస్తున్న ఆయిల్ఫామ్ సాగు, ప్రాసెసింగ్ వంటి అంశాల పైన అధ్యయనం చేసేందుకు అక్కడ పర్యటించాలని ఆహ్వానించారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో భారీ ఎత్తున ఆయిల్ఫామ్ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో కలిసి తప్పకుండా మలేషియాలో పర్యటించి ఆయిల్ ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అధ్యయనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news