నీచానికి దిగజారిన టిడిపి.. తప్పు కప్పిపుచ్చుకునేందుకు గీతాంజలి వ్యవహారంలో విష ప్రచారం..

-

ఏపీలో రాబందుల రాజకీయం నడుస్తోంది.. అంతరించిన రాబందులు తెలుగుదేశం పార్టీ జనసేన రూపంలో సామాన్య జనాల్ని పీక్కు తింటున్నాయి.. తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి వ్యవహారంలో… ఆ రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా అతిగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.. వారి వేధింపులకు బలైన తరువాత కూడా..

ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు సోషల్ మీడియాలో ఫెక్ పోస్టులు పెడుతున్నాయి ఆ రెండు పార్టీలు.. గీతాంజలి ఆత్మహత్య వ్యవహారం తమ పార్టీలకు అంటుకుంటుందని గ్రహించిన నేతలు.. ఆమె వ్యక్తిత్వం మీద అనేక పోస్టులు పెడుతున్నారు.. సభ్య సమాజం తలదించుకునేలా చంద్రబాబు నాయుడు, అయన కుమారుడు లోకేష్ గీతాంజలి విషయంల్లో వ్యవహరుస్తున్నారని మహిళా లోకం మండిపడుతుంది. అమాయకురాలు బలైతే.. సానుభూతి కూడా చూపకుండా.. తప్పుడు ప్రచారం చేస్తుండటం పై వారు మండిపడుతున్నారు..

 

ఆడవారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేయడంలో దిట్టని ఆయన మనస్తత్వం చెందిన పలువురు విమర్శిస్తున్నారు.. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. పదవిని లాక్కున్న సమయంలో కూడా ఆయన ఇలాంటి జిత్తుల మారి వ్యూహలను రచించారని.. ఎన్టీ రామారావు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా.. ఆయన ఓ మహిళకు లోబడి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న సమయంలో పదవి లాక్కున్నామంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారట.. ఈ విషయంలో చంద్రబాబు కొంత సక్సెస్ అయినప్పటికీ.. ప్రస్తుతం మాత్రం చరిత్ర హీనుడిగా అందరికీ గుర్తుండి పోతున్నారు..

రాజకీయ ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి ఆడవారిని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థులను పరచడం.. వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం ఆయనకు మొదటి నుంచి అలవాటేనట.. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో కూడా చిరంజీవిని వ్యక్తిగతంగా డామేజ్ చేశారని.. పలువురు చెబుతున్నారు.. ఇప్పుడు గీతాంజలి వ్యవహారంలో కూడా అదే జరిగిందని.. ప్రభుత్వానికి మంచి పేరు రావడం ఇష్టం లేక..

గీతాంజలి ఆత్మహత్యకు టిడిపి సోషల్ మీడియా కారణమైందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.. ఇల్లు వచ్చిన ఆనందంలో గీతాంజలి మాట్లాడిందే తప్ప.. ఏ పార్టీని తిట్టలేదని.. తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా ప్రాణాలు తీసే తీసిందని పలువురు మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అదేదో సినిమాలో చావు కూడులో ఉన్న రుచి.. దేంట్లో రాదూ అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గీతాంజలి ఉసురు తప్పకుండా తగులుతుందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు…

Read more RELATED
Recommended to you

Exit mobile version