బీజేపీతో పొత్తులో ఉన్నాం.. కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో రాబోయే జ‌న‌ర‌ల్ ఎన్నిక‌లలో పొత్తులపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీ పొత్తు విష‌యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన పొత్తు విష‌యం పై వ‌న్ సైడ్ ల‌వ్ అని చంద్ర‌బాబు పోల్చాడు. అయితే తాజా గా రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో పొత్తులపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఆస‌క్తి క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన బీజేపీ తో పొత్తులో ఉంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.

అయితే తాము పొత్తుల కంటే ముందు త‌మ పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టామ‌ని ప్ర‌కటించారు. అన్ని జిల్లాలల్లో జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి కృషి చేయాల‌ని నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ప‌వ‌న్ కళ్యాణ్ సూచించారు. అలాగే వ‌చ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో.. అంద‌రితో చర్చించిన త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రక‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news