నిన్నటి వ్యాఖ్యల మీద పొంగులేటి క్లారిటీ.. మళ్ళీ అలానే !

-

నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. పదవులు, అధికారం ఎవడబ్బ సొత్తు కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఖమ్మం టీఆర్ఎస్ లో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారడంతో ఆయన నిన్న చేసిన వ్యాఖ్యల మీద క్లారిటీ ఇచ్చారు.

కార్యకర్తలలో భరోసా ఇవ్వడం కోసమే తాను వల్ల మాట్లాడానని పొంగులేటి చెప్పుకొచ్చారు. ఖమ్మంలో తిరగడానికి పాస్పోర్టు అవసరం లేదన్న పొంగులేటి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని అన్నారు. కక్షతో ఇబ్బంది పెడితే వాళ్ళే నష్ట పోతారని ఆయన అన్నారు. మరోసారి కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. వ్యక్తులను టార్గెట్ చేయడం సరికాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version