కరీంనగర్ రూరల్ మండలంలో ముక్దంపూర్ గ్రామంలో గురుకుల వ్యవసాయ బాలికల డిగ్రీ కాలేజీ నిర్మాణానికి పొన్నం ప్రభాకర్ వెళ్లి శంకుస్థాపనని చేశారు. రైతులు కలిసి తమ ఆవేదనని వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నాయని పంటలను కాపాడుకోవడానికి నీళ్లు ఇవ్వాలని అన్నారు. దీని మీద పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నీళ్లు ఇవ్వమని చెప్పినట్లు కొంతమంది హౌలాగాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని నీళ్లు ఆపమని ఏ రాజకీయ నాయకుడైనా చెప్తారా నీళ్లు ఇవ్వమని ఏ ఎదవ అయినా అంటాడా అని ప్రశ్నించారు.
గత సంవత్సరం సెప్టెంబర్ లో వర్షాలు పడకపోవడమే నీళ్లు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని దాని గురించి ఇప్పటికే అడిగారని ఈ అంశం మీద త్వరలోనే మాట్లాడుతామని హామీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ప్రభాకర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. నీళ్లు ఆపమని ఏ రాజకీయ నాయకుడు చెప్పడని నీళ్లు ఇవ్వమని ఏ ఎదవ అయినా అంటాడా అని అన్నారు.