హుస్నాబాద్ లో TTD గుడి నిర్మాణం చేయండి : పొన్నం

-

హుస్నాబాద్ లో వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం కోసం, టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్. మంగళవారం తిరుపతిలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దర్శించుకున్నారు. ఆ తరవాత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి ని కలిశారు. ఇక వివరాలు చూస్తే.. పొన్నం ప్రభాకర్ కి టిటిడి చైర్మన్ సత్కరించి అలానే స్వామివారి చిత్రపటాన్ని కూడా ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… హుస్నాబాద్ ప్రజల అభీష్టం మేరకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంను నిర్మించాలని ఆయన టీటీడీ ని కోరినట్టు చెప్పారు. అలానే ఆలయానికి సరిపడా స్థలాన్ని కూడా సమకూరుస్తామని మంత్రి పొన్నం టిటిడి చైర్మన్ కి చెప్పారు. వెంకటేశ్వర స్వామి కృపా, కటాక్షాలు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అలానే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని రాష్ట్ర మంత్రిగా ఆ స్వామి వారిని కోరుకున్నట్లు పొన్నం చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news