ముద్రగడకు పవన్ సారీ చెప్పాల్సిందే: పోసాని

-

పవన్ మరియు ముద్రగడ పద్మనాభం మాటల యుద్ధంపై APFDC చైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. కాపుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన ముద్రగడ పద్మనాభంను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. పవన్ రాజకీయంలో ఇప్పుడు ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వ్యక్తి.. అస్సలు ఈ రాష్ట్రంలో కాపుల మధ్యన గొడవలు మొదలైంది పవన్ రాజకీయాల్లోకి వచ్చాకే అన్నారు. పవన్ కళ్యాణ్ ముద్రగడ పై చేసిన వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత వహిస్తూ వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబును మరియు టీడీపీని ఎన్ని విధాలుగా తిట్టావు పవన్.. ఇప్పుడు అదే నోటితో చంద్రబాబు సీఎం కావాలని అంటున్నావు అంటూ రెచ్చిపోయి మాట్లాడారు పోసాని.

చంద్రబాబు గురించి చంటిపిల్లాడికి కూడా ఒక క్లారిటీ వచ్చాక… ఆయనకు మద్దతు ఇవ్వడం ఏమిటని వాపోయారు. ఇంకా పవన్ పై చాలా వ్యాఖ్యలు చేసి పోసాని… చివరకు ముద్రగడకు క్షమాపణలు చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news