బాలకృష్ణకో న్యాయం.. ఇతరులకు మరొకటా..? పోసాని సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతి గురించి మీ నాయకుడు మోడీనే చెప్పాడు అని..చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్, కేడీ అని మోడీ అన్నారు..బాలకృష్ణ తన రివాల్వర్ తో ఇద్దరిని కాల్చాడు.. బాలకృష్ణ బయపడి పురంధరేశ్వరి దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. పురంధరేశ్వరి, వెంకటేశ్వర్ రావు ఇద్దరు వైఎస్ దగ్గరికి వచ్చారు.

మా తమ్ముడు ఇద్దరిని కాల్చాడు అన్నయ్య అని వైఎస్ కాళ్ల మీద పడింది.బాలకృష్ణని సెల్ లో పెట్టకుండా వైఎస్ కాపాడారు. ఓ ఆడపిల్ల తన దగ్గర ఏడ్చింది కాబట్టి. క్రిమినల్స్ ని కాపాడటం మీ మెంటాలిటీనా. ఎన్ని సార్లు, ఎన్ని పార్టీలు మారుతారు మేడం. మీ నాన్న మద్యపానం నిషేధిస్తే… బాబు మళ్ళీ మద్యం ఏరులై పారించాడు. రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంపేశారు. మీ ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిష్టర్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు. కాంగ్రెస్ లో చేరారు… రామారావు కూతురిని అని చెప్పుకున్నారు. సోనియా గాంధీ సీట్ ఇచ్చారు… కాంగ్రెస్ ఓడిపోగానే బీజేపీలో చేరారు. బీజేపీ ఓడిపోతే మళ్లీ కాంగ్రెస్ లో చేరుతారా అని పురంధేశ్వరికీ పోసాని కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news