పవన్ కళ్యాణ్ పై పోసాని కీలక వ్యాఖ్యలు…

-

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలను అటు రాజకీయంగా ఇటు కుల పరంగా చాలామంది విమర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు సినీ నటుడు మరియు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈయన మాట్లాడుతూ ఒక కాపుగా ఉన్న పవన్ కళ్యాణ్… మరో కాపు నేత ముద్రగడ పద్మనాభం గురించి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను పట్టుకుని చెప్పుతో కొడతాను అంటారా అంటూ బాధపడ్డారు పోసాని. ఒక కాపు మరో కాపును తిట్టడం ఏమిటయ్యా.. రాజకీయం వేరు కులం వేరు.. ఇవి తెలుసుకుని ప్రవర్తించు అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రాధేయపడ్డాడు పోసాని.

పవన్ కళ్యాణ్ నేను నీ గురించి చాలా ఊహించుకున్నాను.. ఇంతలా తెలివిలేకుండా మాట్లాడుతున్నావేమిటయ్యా అంటూ జాలిగా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version