పోస్టాఫీసులోని ఈ పథకాలలో డబ్బులు పెడితే లాభాలే..లాభాలు..!

-

ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లలో డబ్బులు పెట్టడం సురక్షితమైన మార్గం.. వడ్డీ తో పాటు మంచి లాభాలు కూడా వస్తాయి. మన డబ్బులు సేఫ్ గా మన చేతికి వస్తుంది. అందులో పోస్టాఫీసు పథకాల లో డబ్బులు పెడితే లాభాలు మాములుగా ఉండవు..అయితే ఎటువంటి పథకాలలో డబ్బులు పెడితే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

పోస్టాఫీసుకు సంబంధించిన నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్‌పై ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది ఐదేళ్ల సేవింగ్ స్కీమ్. ఇందులో పెట్టుబడితో ఇన్‌కంటాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. ఈ వడ్డీను లెక్కేస్తే పదేళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మరో పోస్టాఫీసు పథకం సుకన్య సమృద్ది యోజన. ఈ స్కీమ్‌పై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. అమ్మాయిల కోసం ఈ పథకం ప్రారంభించారు. ఇందులో డబ్బులు డబుల్ అయ్యేందుకు దాదాపు 9.47 ఏళ్ల పడుతుంది. ఇక మరో పథకం పోస్టాఫీసు సీనియర్ సిటిడన్ స్కీమ్. ఇందులో ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ స్కీమ్ ప్రకారం మీ డబ్పులు రెట్టింపయ్యేందుకు 9.73 ఏళ్లు పడుతుంది.

ఇకపోతే 15 ఏళ్ల పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే ఈ రేటుతో మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు దాదాపు 10.14 ఏళ్లు పడుతుంది. ఇక మరో పథకం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్. కాగా, ప్రస్తుతం లభిస్తున్న 6.6 వడ్డీ ప్రకారం మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు దాదాపుగా 10.91 ఏళ్లు పడుతుంది. పోస్టాఫీసు సేవింగ్ బ్యాంక్ ఎక్కౌంట్‌లో మీరు డబ్బులు పెట్టుబడి పెడితే..మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు దీర్ఘకాలం నిరీక్షించాలి. ఇందులో కేవలం 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఇది 18 ఏళ్ల సమయం పడుతుంది.

ఇది ఇలా ఉండగా.. మరో పథకం కూడా ఉంది.. అదే రికరింగ్ డిపాజిట్ పథకం. ఇందులో 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు 12.41 ఏళ్లు పట్టనుంది. పోస్టాఫీసులో ఏడాది నుంచి మూడేళ్ల వ్యవధికి టైమ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. ఇందులో 5.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు 13 ఏళ్లు పడుతుంది…మంచి వడ్డీ కూడా లభిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news