విలేకరుల వీపులు వాయగొడతామంటూ కర్నూలు నగర మేయర్ సంచలన వ్యాఖ్యలు

-

కర్నూలు నగర మేయర్ బివై రామయ్య ప్రింట్ జర్నలిస్టులను వీపు వాయిస్తానంటూ హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలో వైసీపీ సామాజిక న్యాయంభేరి బస్సు యాత్ర వచ్చిన సమయంలో మధ్యాహ్నం ఎండ ఉందని నీడ చాటుకు ప్రజలు వెళితే.. బస్సు యాత్రలో ప్రజలు ఎవరూ లేరు అంటూ ఫోటోలు తీసి కొన్ని పత్రికలు పనిగట్టుకుని ప్రచారం చేశాయని రామయ్య ఆరోపణ చేశారు.

నిజానికి ఆ బస్సు యాత్ర ఫ్లాప్ అయింది. అయితే ఆ అసహనాన్ని మీడియా మీద చూపించారు కర్నూలు మేయర్ రామయ్య. సహనం కోల్పోయి మీడియా పై చిందులు తొక్కారు. అధికారంలో ఉండేది తమ ప్రభుత్వమని.. మీ వొళ్ళు వాయ కొడతాం జాగ్రత్త అంటూ మీడియా ప్రతినిధులను బెదిరించారు. మేయర్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి జర్నలిస్టు సంఘాలు. లేదంటే తమ పోరాటం కొనసాగిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news