కన్నీళ్ళతో అందరినీ ఎమోషనల్ చేసిన ప్రభాస్.. బాధను భరిస్తూ..!

-

ప్రభాస్.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ను ఆహా నిర్వాహకులు రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేశారు. ఈ క్రమంలోని డిసెంబర్ ఆఖరి వారంలో మొదటి భాగాన్ని విడుదల చేయగా .. జనవరి 6వ తేదీ రెండవ భాగాన్ని కూడా స్ట్రీమింగ్ చేశారు. ఎపిసోడ్ మొదటి భాగంలో ప్రభాస్ ఒక్కడే హాజరై సందడి చేయగా ఇప్పుడు రెండవ పార్టులో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా హాజరయ్యాడు. ఈ ఇద్దరు కలిసి బాలయ్యతో ఎన్నో విషయాలలో చర్చించి సందడి చేశారు. అంతేకాదు బాలయ్య కూడా వీరిద్దరిని ఇరుకునపెట్టే ప్రశ్నలతో ఆటపట్టించారు.

అలాగే గోపీచంద్ కెరియర్ గురించి.. ఆయన తండ్రి గురించి.. బాల్యం గురించి కూడా అడిగారు బాలకృష్ణ. గోపీచంద్ కు నెక్స్ట్ సినిమా టైటిల్ కూడా పెట్టేశారు.. రామబాణం అనే టైటిల్ పెట్టుకో వంద రోజుల ఫంక్షన్ కు నేను వస్తా అని తెలిపారు బాలయ్య. మరొకవైపు ప్రభాస్ గురించి మాట్లాడుతూ కృష్ణంరాజు ప్రభాస్ కలిసి ఉన్న ఫోటోలను చూపించగా.. ప్రభాస్ గురించి కృష్ణంరాజు చెప్పిన మాటలను వీడియో రూపంలో చూపించారు ఈ వీడియోలో కృష్ణంరాజు ప్రభాస్ గురించి చెబుతూ.. చాలా గర్వంగా ఉంది.. నన్ను మించిపోయాడు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

అయితే ఈ వీడియో చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం కృష్ణంరాజుకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. ఆ సమయంలో పంటి బిగువున బాధను బిగబట్టి చమర్చిన కళ్ళతో ఉన్న ప్రభాస్ ని చూసి బాలయ్య కూడా ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు వీరిద్దరిని అలా చూసి అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ కూడా బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news