హసన్ సెక్స్ స్కాండల్.. తొలిసారి స్పందించిన ప్రజ్వల్

-

కర్ణాటక హసన్‌ సెక్స్‌ రాకెట్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఈ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. నిజం గెలుస్తుందని సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. తాను ప్రసుత్తం బెంగళూరులో లేనని అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఎక్స్‌లో తెలిపారు. తన న్యాయవాది ద్వారా బెంగళూరులోని సీఐడీకి సమాచారమిచ్చానని వెల్లడించారు. త్వరలోనే నిజం గెలుస్తుందని ప్రజ్వల్‌ పోస్టు పెట్టారు.

మరోవైపు ఇటీవలే జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ నుంచి ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగం పుంజుకుంది. దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన 18 మంది అధికారుల బృందం.. హొళెనరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేసిన 47 ఏళ్ల బాధితురాలు వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కేసులో ఏ1గా ఉన్న హెచ్‌డీ రేవణ్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news