ప్రశాంత్ కిషోర్ ఎన్నికల జోస్యం హాస్యాస్పదం : కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్

-

ఇటీవల వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ నంబర్ 1కి వచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా పుంజుకోవచ్చని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ స్పందించారు. ప్రశాంత్ కిషోర్ కిషోర్ హస్యాస్పదంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… ప్రశాంత్ కిషోర్ జోస్యం ‘బీజేపీ స్పాన్సర్డ్ షో’ లా ఉందన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆర్ఎస్ఎస్ వ్యక్తే అయినా మారువేశంలో రాజకీయ విశ్లేషకుడిగా మారాడు అని విమర్శించారు. కాబట్టి అతని వ్యాఖ్యలను బీజేపీ ప్రాయోజిత కార్యక్రమమని పిలవాలని అజోయ్ కుమార్ అన్నారు.

నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కూటమిలో ఉన్నప్పుడు ప్రయత్నించారని, ఆ తరాత బీజేపీలో చేరాక ఆ విషయాన్ని పట్టించుకోలేదని సంచలన ఆరోపణ చేశారు.ఇదే సమయంలో వంశపారంపర్య రాజకీయాలకు సంబంధించి బీజేపీ ఆరోపణలపై మండిపడ్డారు. 27 సంవత్సరాలుగా గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్‌కు ప్రధాని లేరనే విషయం గుర్తించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news