మొన్న గర్భిణి ఏనుగు..ఇవాళ గర్భిణి ఆవు..!

-

కొబ్బరికాయలో పేలుడు పదార్థాలను అమర్చి ఓ గర్భిణి ఏనుగును చంపిన సంగతి అందరికీ తెలిసిందే. కేరళలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ ఘటన మర్చిపోకముందే, అలాంటి దారుణం మరొకటి ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బిలాస్ పూర్ జిల్లా జాందుత్తలో ఓ గర్భిణి ఆవుకు పేలుడు పదార్థాలు పెట్టారు. దీనిపై ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఆవుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన పొరుగింట్లో ఉంటున్న నందలాల్ అనే వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించాడు. బాంబు పేలడం వల్ల ఆవు దవడ పగిలిపోయింది. ప్రస్తుతంఆ ఆవు తిండి కూడా తినలేని పరిస్థితిలో నరకాన్ని అనుభవిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటన జరిగిన రోజు నుంచి నందలాల్ కనిపించడం లేదు. దీంతో, అతనిపై అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news