మీకోసం 124 సార్లు బటన్ నొక్కా.. నా కోసం రెండు బటన్లు నొక్కండి – వైఎస్ జగన్

-

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఏలూరు జిల్లాలోని దెందులూరులో ‘సిద్ధం’ సభలో పాల్గొన్నారు.అనంతరం దెందులూరు ‘సిద్ధం’ సభలో జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు…. మీరే నా స్టార్‌ క్యాంపెయినర్లు.. ఈ ఎన్నికల్లో జగనన్న కోసం మీరు పనిచేయాలి అని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. మళ్లీ జగనన్న రావాలి.ఇంత మంచి చేసిన ప్రభుత్వాన్ని కొనసాగించడానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని సీఎం జగన్ కోరారు.

‘మీ కోసం 124 సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం మీరు 2024 ఎన్నికల్లో రెండుసార్లు (అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు)బటన్ నొక్కలేరా? జగనన్నకు ఓటు వేయకపోతే ఇప్పుడున్న స్కీముల రద్దుకు ఆమోదం తెలిపినట్టే అని ఆయన అన్నారు.ప్రతిపక్షాలకు ఓటే వేస్తే మళ్లీ లంచాలు, వివక్ష మొదలవుతాయి’ అని జగన్ తెలిపారు. రా కదలి రా అంటూ చంద్రబాబు ప్రజలను పిలవడం లేదని, ప్యాకేజీ ఇస్తా అంటూ రా కదలి రా అంటూ దత్త పుత్రుడు, వదినమ్మ దగ్గుపాటి పురంధేశ్వరిని పిలుస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news