ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తి కాదు… శక్తి : చంద్రబాబు నాయుడు

-

ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ‘మోదీ ఒక వ్యక్తి కాదు. ఇండియాని విశ్వగురువుగా మార్చిన ఒక శక్తి. మోదీ అంటే అభివృద్ధి, సంస్కరణ, భవిష్యత్తు, ఆత్మగౌరవం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడాయన అని తెలిపారు. చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభ సందర్భంగా… చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…..పీఎం ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి మోదీగారు’ అని అన్నారు.

 

సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆయన దుయ్యబట్టారు. ‘కేంద్ర సహకారంలో మేము 70 శాతం పోలవరం పూర్తి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది అని ధ్వజమెత్తారు.లాండ్, శాండ్, మైన్, వైన్స్ పేరుతో దోచేశారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జే బ్రాండ్ లిక్కర్ ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి తన ఆదాయాన్ని పెంచుకున్న దుర్మార్గుడు జగన్’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news