ప్రియాంక గాంధీ: కర్ణాటక నుండి బీజేపీ ఒకటిన్నర లక్ష కోట్లు లూటీ !

-

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఈ మూడున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ఏమి చేసిందో ఈమె క్లారిటీ గా చెప్పారు. బీజేపీ అభివృద్ధిని పక్కన పెట్టి కోట్లను దోచుకోవడం పనిగా పెట్టుకుంది. బీజేపీ కర్ణాటక రాష్ట్రము నుండి ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలను లూటీ చేసింది అంటూ ఆరోపించింది. బీజేపీ దోచుకున్న ఈ డబ్బుతో దేశవ్యాప్తంగా 100 ఎయిమ్స్ హాస్పిటల్స్, 30 వేల స్మార్ట్ క్లాస్ రూమ్స్ మరియు 30 లక్షల మందికి ఇళ్లను కట్టించవచ్చని ఈమె పేర్కొంది.

మాములుగా కొందరు దొంగలు మాత్రం ఇళ్లను మాత్రమే దొంగిలిస్తూ ఉంటారు. కానీ బీజేపీ మాత్రం ఏకంగా రాష్ట్రాలను దొంగిలిస్తుంది అంటూ ఫైర్ అయ్యారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించి ఇంట్లో కూర్చోపెట్టాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version