ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకుని అలాగే చంపండి.. చెన్నకేశవులు తల్లి .. వీడియో

-

వాళ్ళను చంపేయండి” ఇప్పుడు దేశంలో ప్రతీ ఒక్కరి నోట వినపడుతున్న మాట. షాద్ నగర్ ప్రియాంక హత్య కేసు నిందితులను ఉద్దేశించి చేస్తున్న డిమాండ్ అది. నాలుగు రోజుల క్రితం వెటర్నరి డాక్టర్ ప్రియాంకా రెడ్డిని అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసి… ఆమెను కాల్చి చంపిన ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశం పరువు పోయే పరిస్థితి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక నిందితులను వెంటనే చంపాలి అంటూ బాలికలు అందరూ తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ర్యాలీలు చేస్తున్నారు.

ఇక నిందితులను తమకు అప్పగించాలని షాద్ నగర్ లో స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నలుగురు నిందితుల కుటుంబాలు… ఇప్పుడు ఈ విషయంలో బాలికకు మద్దతుగా నిలుస్తున్నాయి. నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియాతో మాట్లాడుతూ… ప్రియాంక ను ఏ విధంగా చంపారో తన కొడుకుని కూడా అదే విధంగా చంపాలని ఆమె డిమాండ్ చేసారు. తన కొడుకు ఇలాంటి పని చేసాడని… తన భర్త ఆత్మహత్యకు ప్రయత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆరిఫ్ లారి పాడైందని తన…

కొడుకుని తీసుకు వెళ్ళాడని… ఆరిఫ్ తో స్నేహం తర్వాతే పాడైపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ వివాహం చేసుకున్నా సరే తాము ఏమి అనలేదని చెప్పిన ఆమె… కిడ్ని పాడైందని… ఇప్పుడు ఊరు అంతా తమ గురించే మాట్లాడుతున్నారని… ఉరి వేయండి లేదా కాల్చి చంపండని ఆమె మీడియాతో అన్నారు. ఇక తాను మాత్రమే తొమ్మిది నెలలు మోసి కనలేదని ఆ అమ్మాయి తల్లి కూడా కన్నారని ఆమె చెప్పడం విశేషం. ఇక మిగిలిన ముగ్గురు నిందితుల తల్లి తండ్రులు కూడా వాళ్ళను చంపాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news