చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గ‌ణేష్ కోర్టుకు హాజ‌రు

-

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేష్ కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే ఇటీవ‌ల బండ్ల గ‌ణేష్ పై చెక్ బౌన్స్ కేసు న‌మోదు అయిన విషయం తెలిసిందే. కాగ ఈ కేసు వాయిదా నేడు ఉండ‌టంతో నిర్మాత బండ్ల గ‌ణేష్ కోర్టుకు రావాల్సి వ‌చ్చింది. ఆంధ్ర ప్ర‌దేశ్ లోని ఒంగోలు లో గ‌ల రెండో అడిషన‌ల్ కోర్టుకు నిర్మాత బండ్ల గ‌ణేష్ హాజ‌రు అయ్యారు. కాగ గ‌త కొద్ది రోజుల క్రితం నాగుల‌ప్ప‌ల‌పాడు మండ‌ల ముప్పాళ్ల‌కు చెందిన జెట్టి వెంక‌టేశ్వ‌ర్లు అనే వ్య‌క్తి వ‌ద్ద నిర్మాత బండ్ల గ‌ణేష్ రూ. 95 ల‌క్షల అప్పు తీసుకున్నారు.

బండ్ల గ‌ణేష్ త‌న సినిమా నిర్మాణ సంస్థ అయిన ప‌ర‌మేశ్వ‌ర ఆర్ట్ ప్రొడ‌క్షన్స్ కోసం అప్పు తీసుకున్నారు. అయితే న‌గ‌దు చెల్లింపుల విషయంలో ఇద్ద‌రి మ‌ధ్య వివాదం చోటు చేసుకున్న‌ట్టు స‌మాచారం. కాగ ఈ క్ర‌మంలో బండ్ల గ‌ణేష్.. చెక్ ను ఇచ్చాడు. అయితే అది బౌన్స్ కావ‌డంతో.. జెట్టి వెంక‌టేశ్వ‌ర్లు 2019 లోనే కోర్టు ఆశ్ర‌యించాడు. దీంతో బండ్ల గ‌ణేష్ పై ఇటీవ‌ల చెక్ బౌన్స్ కేసు న‌మోదు అయింది. కాగ ఈ కేసు వాయిదా నేడు ఉండ‌టంతో కోర్టు కు హాజ‌రు అయ్యాడు. కాగ ఈ కేసును కోర్టు మే 2వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news