క‌రోనా : ఏపీలో జీరో

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. అలాగే రిక‌వ‌రీ రేటు ఎక్కువగా ఉండ‌టం వ‌ల్ల యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా త‌గ్గాయి. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య వెయి లోపే ఉన్నాయి. కాగ కాసేప‌టి క్రితం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు రాష్ట్ర క‌రోనా బులిటెన్ విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 11,408 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

 

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 3,32,13,004 క‌రోనా ప‌రీక్షల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించింది. కాగ నేటి క‌రోనా ప‌రీక్షల్లో 70 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. 23,18,617 కు చేరింది. కాగ ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 129 మంది క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 758 క‌రోనా యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news