భూపాలపల్లిలో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు నిరసన సెగ

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకి నిరసన సెగ తగిలింది. గణపురం మండలం చెల్పూరులో దుబ్బపల్లి నిర్వాసితులు సీఎండీని అడ్డుకున్నారు. గ్రామాన్ని మరో చోటుకు తరలిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటి వరకూ ఎందుకు నెరవేర్చడం లేదని గ్రామస్థులు ప్రభాకర్ రావుని ప్రశ్నించారు. పదేళ్లుగా బూడిదలో బతుకుతున్నామమని, పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ దశలో గ్రామస్థులు వేసిన ప్రశ్నలకు సీఎండీ ఉక్కిరి బిక్కిరి అయ్యారు.కేటీపీపీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో ఎట్టకేలకు రెండు నెలల్లో గ్రామాన్ని ఖాళీ చేయిస్తానని ప్రభాకర్ రావు గ్రామస్థులకు హామీ ఇచ్చారు. గ్రామం తరలింపులో అలసత్వం వహించడం వల్లే ఇంతవరకూ వచ్చిందని కేటీపీపీ సీఈపై సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా దుబ్బపల్లిని ఖాళీ చేయించి మరోచోటుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news