హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన దొంగ‌లు..అయ్య‌ప్ప స్వాముల ద‌గ్గ‌ర భారీ చోరీ

-

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఎవ‌రూ లేన‌ట్లు…ఏకంగా అయ్యప్ప స్వాములకే పంగ నామాలు పెట్టాడు ఓ దుండగులు. హిమాయత్ సాగర్ దర్గా ఖలీజ్ ఖాన్ లో అయ్యప్ప స్వామి దీక్ష బూనిన స్వాముల బ్యాగ్ లో వున్న 30 వేల నగదు, ఓ బైక్ దొంగలించారు కొంత మంది దుండగులు.

అర్ధరాత్రి స్వాములు నిద్రిస్తున్న సమయంలో పక్కన రూమ్ లో వున్న బ్యాగ్ లో నుండి 30 వేల నగదు, ఇంట్లో పార్క్ చేసిన బైక్ తో ఉడాయించారు ఆ కేటుగాళ్లు. ఉదయం నిద్ర లేచి చూసే సరికి బైక్ కనబడక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ అయ్య‌ప్ప‌ స్వాములు. బైక్ తో పాటు నగదు పోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. ఎంత మంది దొంగ‌త‌ నానికి పాల్ప‌డ్డారు… దీని వెనుక ఎవరు ఉన్నార‌నే దానిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version