సెంచురి మ్యాట్రెసెస్ అంబాసిడర్ గా పీవీ సింధు

-

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెస్ బ్రాండ్ అయిన సెంచురీ మ్యాట్రెస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ సంచలనం పివి సింధును స్వాగతిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఛాంపియన్‌ల సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఒకరు బ్యాడ్మింటన్ ఆటలో ప్రసిద్ధి చెందినవారైతే.. మరొకరు స్లీప్ అండ్ కంఫర్ట్ లలో తన ప్రత్యేకతకు ప్రసిద్ధి చెందినవారు. 

బ్యాడ్మింటన్ కోర్టు వెలుపల పివీ సింధు కొత్త పాత్రలో.. సెంచురీ వినూత్న ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఫిట్‌నెస్, శ్రేయస్సు కోసం సరైన మ్యాట్రెస్  ప్రాముఖ్యతను చాటుతుంది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పి.వి. సింధు జాతీయ ప్రజాదరణ పొందడం వల్ల, ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను చేరుకోగలుగుతుందని కంపెనీ భావిస్తోంది. సెంచురీ ఇటీవలే జెల్ లాటెక్స్, ఎ-రైజ్ & విస్కోప్డిక్ మెట్రెస్‌లను మార్కెట్ లో ప్రవేశపెట్టింది. దీంతో మాట్రెస్ బ్రాండ్ కన్వెన్షనల్ జెల్ టెక్నాలజీ నుండి కాపర్ జెల్ టెక్నాలజీకి మారడంలో ఇండస్ట్రీ లీడర్‌గా అవతరించింది. శరీరానికి ఒత్తిడి, ఉపశమనాన్ని అందించే సహజ నొప్పి నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది, కొత్త కాపర్ జెల్ సాంకేతికత మ్యాట్రెస్, ఉపరితలంపై శరీర వేడిని తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news