డికాక్ ఇరగ్గోట్టాడు.. ముంబై ఇండియన్స్ కి కేక్ వాక్ విక్టరీ

-

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తన సత్తా చాటింది. ఈరోజు అబుదాబిలో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ మీద గెలిచి పాయింట్ టేబుల్ లో మొదటి స్థానానికి చేరింది. 149 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో అది కూడా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 44 బంతుల్లో ఏకంగా 78 పరుగులు చేసి ప్రత్యర్ధి బౌలర్స్ కి చుక్కలు చూపించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 35 పరుగులతో ఫర్వాలేదనిపించుకున్నాడు. హార్దిక్ పాండ్యా చివర్లో తిరిగి 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఇక కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివం మావి చెరో వికెట్ సాధించారు. ఇప్పటి వరకు అన్ని జట్లు ఎనిమిదేసి మ్యా‌చ్‌లు ఆడాయి. ఈ మ్యాచ్‌లో గెలవడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది ముంబై ఇండియన్స్. 6 మ్యాచ్‌లు గెలిచి ప్రస్తుతానికి 12 పాయింట్లతో నెంబర్ వన్ పొజిషన్‌ కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news