సవాల్ చేస్తే.. తోక ముడిచారు.. రఘురామ ఘాటు కామెంట్..!?

-

ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పించి విరుచుకుపడడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి జగన్ సర్కారు తీరుపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అంటూ తెలిపిన రఘురామ కృష్ణంరాజు…. రాజధాని కొనసాగింపు రెఫరెండం గా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అంటూ తాను విసిరిన సవాల్కు జగన్ సర్కార్ బదులు ఇవ్వలేక తోక ముడుచుకుని ఉంది అంటూ విమర్శలు గుప్పించారు.

ప్రతి విషయంలో కూడా సంస్థలను భ్రష్టు పట్టించే విధంగా జగన్ సర్కార్ ముందుకు సాగుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ కృష్ణంరాజు… ఇక జగన్ సర్కారు తప్పులపై ప్రశ్నించినందుకు తనపై ఎంతో మంది బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ తెలిపారు. అమరావతి రైతులు అందరు 300 రోజులుగా ఉద్యమం చేపట్టినప్పటికీ జగన్ సర్కారు మాత్రం పట్టించుకోవడంలేదని… జగన్ సర్కారు తీరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఏపీ లో రాష్ట్రపతి పాలన వచ్చిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు అంటూ విమర్శలు గుప్పించారు రఘురామకృష్ణంరాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version