గుడ్ న్యూస్ : ఏపీలో తగ్గిన కరోనా కేసులు

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,224 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 758951కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 32 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6256కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43983 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ap-corona

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 708712 కు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 61,112 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 66,30,728 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 209, చిత్తూరులో 293, తూర్పుగోదావరి జిల్లాలో 547, గుంటూరులో 379, కడపలో 190, కృష్ణాలో 86, కర్నూలులో 136, నెల్లూరులో 166, ప్రకాశంలో 270, శ్రీకాకుళంలో 133, విశాఖపట్నంలో 135, విజయనగరంలో 191, పశ్చిమ గోదావరిలో 489 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version