తిరుమలలో భారీ వర్షం….

-

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఏపీలోని పలుచోట్ల ఈ సాయంత్రం ఆకస్మిక వర్షాలు కురిశాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి అధిక ఉష్ణోగ్రత నెలకొన్న తిరుమల కొండలను సాయంత్రానికి మేఘాలు కమ్మేశాయి. భారీ వర్షంతో తిరుమల తడిసి ముద్దయింది. శ్రీవారి ఆలయం ఎదుట, తిరు మాడవీధుల్లో నీరు ప్రవవహించింది.

దర్శనం ముగించుకుని అప్పుడే బయటికి వచ్చిన భక్తులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ఇబ్బంది పడ్డారు. పలు షాపింగ్ సముదాయాల్లోకి నీరు ప్రవేశించింది. వేసవి కారణంగా భక్తులు ఎండవేడిమితో ఇబ్బంది పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కాస్త భక్తులకు ఉపశమనం దొరికింది. ఏపీలో ఈ సాయంత్రం పలుచోట్ల ఆకస్మిక వర్షాలు కురవడంతో
వాతావరణం చల్లబడింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version