ఇండియా- కివిస్ టెస్టు మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు.. టాస్ వాయిదా

-

ఇండియా, న్యూజిలాండ్ ల మ‌ధ్య జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగం గా నేడు చివ‌రి టెస్టు మ్యాచ్ జ‌రుగుతుంది. అయితే ఈ మ్చాచ్ కు వ‌ర్ష ముప్పు ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో భాగం గా ఇప్ప‌టి కే జ‌ర‌గాల్సిన టాస్ వాయిదా ప‌డింది. ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖ‌డే వేదిక గా జ‌ర‌గుతుంది. అయితే ముంబై న‌గ‌రంలో గ‌త మూడు రోజుల కురుస్తున్న వ‌ర్షాల కార‌ణం గా స్టేడియం త‌డి గా ఉంది.

ముఖ్యం గా పిచ్, అవుట్ ఫీల్డ్ త‌డి గా ఉన్నాయి. దీంతో టాస్ ను కొంత స‌మ‌యం వ‌ర‌కు వాయిదా వేశారు. 9:30 గంట‌ల‌కు స్టేడియం సిబ్బంది మ‌రోసారి పిచ్ ను అవుట్ ఫీల్డ్ ప‌రిశీలించ నున్నారు. అయితే ఈ రోజు మ్యాచ్ ప్రారంభం అయినా.. ఈ మ్యాచ్ కు వ‌ర్ష ముప్పు త‌ప్ప‌ద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. కాగ ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య రెండు టెస్టు ల సిరీస్ నడుస్తుంది. ఇప్ప‌టికే జ‌రిగ‌న మొద‌టి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్ గెలిచిన వారికే సిరీస్ ద‌క్కే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news