రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి ఈ నెల 12 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నిజామాబాద్‌, జగిత్యాల,మంచిర్యాల, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి,పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌,వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ములుగు, మెదక్‌, కామారెడ్డి,వరంగల్‌, హన్మకొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి,వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కామారెడ్డి,కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలుపడుతాయని.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలుపడే సూచలున్నాయని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news