రజినీకాంత్‌కు తీవ్ర అస్వస్థత..

-

సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న్నట్టు సమాచారం అందుతోంది. రజనీ కాంత్‌ హైబీపీతో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల ఒక సినిమా షూటింగ్ కోసం రజనీ కాంత్ హైద్రాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.

రజని షూటింగ్ టీం లో కొందరికి ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. రజనికి కారోనా టెస్ట్ లలో ఆరోజు నెగటివ్ అని వచ్చినా బిపి పెరగడంతో ఆస్పత్రిలో చేరినట్టు చెబుతున్నారు. యూనిట్ లో వారికి కరోనా అని తెలినప్పటి నుండే రజనీ కాంత్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాలు అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news