పైశాచికత్వం: 14 ఏళ్ళ బాలికపై అత్యాచారం, ముక్కలు చేసి ఇటుక బట్టీలో కాల్చిన నరహంతకులు !

-

ఈ రోజు ఏ చోట చూసినా మృగాళ్లు కామకోరికలతో వెర్రెక్కి కొట్టుకుంటున్నారు. వయసుతో ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం ఆడది అయితే చాలు అన్నట్లుగా అత్యాచారాలు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఒక దారుణం కన్నీళ్లను తెప్పిస్తోంది. రాజస్థాన్ లోని భిల్వారా లో గుర్తు తెలియని నరహంతకులు 14 సంవత్సరాల అమ్మాయిని ఎత్తుకు వెళ్లి విచ్చలవిడిగా అత్యాచారం చేసి ఆమెను చంపేసి అంపైన ముక్కలు ముక్కలుగా కోసి ఇటుకల బట్టీలో వేసి కాల్చారు. ఇదంతా తెలియని అమ్మాయి తల్లితండ్రులు కూతురు ఇంతకీ కన్పించకపోవడంతో అటూ ఇటూ వెతుకుతూ దగ్గర్లోని ఇటుక బట్టీ దగ్గర తన అవశేషాలను గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా … విచారణ చేపట్టిన పోలీసులు వేగవంతంగానే ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు నింధితులను పట్టుకున్నారు.

మరి వీరెవ్వరు ఎందుకు ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు అన్న పూర్తి వివరాలు తెలియాలంటే విచారణ చేసే వరకు ఆగాలి.

Read more RELATED
Recommended to you

Latest news