బంపర్ ఆఫర్: ఎన్నికల్లో గెలిస్తే ఫ్రీగా లాప్ టాప్ లు, టాబ్లెట్ లు !

-

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ మరియు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. కాగా తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఎన్నికల హామీలలో భాగంగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ మరియు లాప్ టాప్స్ ఇస్తామని చెప్పడం విశేషం. ఏ విద్యార్థి అయినా కాలేజీలో జాయిన్ అయిన మొదటి సంవత్సరం లోనే అందచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అంతే కాకుండా ప్రజలు అంతా కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపిస్తే మళ్ళీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే దిశగా చట్టం తీసుకువస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ తెలియచేయడం విశేషం. ప్రస్తుతం లాప్ టాప్ ట్యాబ్ ల అంశం పై సంచలనం రేపుతోంది, కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా చూడాలి.

కానీ బీజేపీ చాలా కసిగా రాజస్థాన్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news