బండ్లగూడ రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ నేడే.. ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌

-

బండ్లగూడ రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి అధికారులు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. పోచారంలో సోమవారం నిర్వహించిన ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. అయితే.. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు వ‌చ్చాయి. జూబ్లీహిల్స్‌ అంబేద్కర్‌ వర్సిటీలో ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు అధికారులు.

కాగా.. లాటరీ ప్రక్రియను ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఇవాళ బండ్లగూడ 1,2 బీహెచ్‌కే, బుధవారం బండ్లగూడ 3 బీహెచ్‌కేలోని ప్లాట్లకు లాటరీ తీయనున్నారు. అయితే, ఈ పూర్తి ప్రక్రియను హెచ్‌ఎండీఏ అధికారులు రికార్డ్‌ చేయడ‌మే కాకుండా.. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్‌ మాత్రమే కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్‌ సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version