ఆషాడం బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.. మరో రెండు రోజుల్లో!

-

మరో రెండు రోజుల్లో ఆషాడం బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం గోల్కొండ కోట వద్ద స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పటి నుంచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని గుర్తు చేశారు. ఇప్పటికే బోనాల పండుగ, బతుకమ్మ పండుగలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయన్నారు. ఈ నెల 30వ తేదీన గోల్కొండ, జులై 17వ తేదీన సికింద్రాబాద్, 24వ తేదీన హైదరాబాద్‌లో బోనాలు జరుగుతాయని అన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version