అసెంబ్లీ ఘటనపై చంద్రబాబుకు రజినీకాంత్ ఫోన్

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు రోజుల కింద జరిగిన ఘటనపై.. ప్రతిపక్ష పార్టీ నాయకులతోపాటు… సినీ తారలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి పై అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన వ్యక్తిగత దూషణ పై సూపర్ స్టార్ రజినీకాంత్ విచారం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆదివారం ఉదయం చంద్రబాబు నాయుడుకు రజనీకాంత్ ఫోన్ చేసి మాట్లాడారు. శాసన సభలో జరిగిన ఘటనతో మానసికంగా బాధపడుతూ ఉన్న ఆయనను పరామర్శించారు రజినీకాంత్. అనంతరం ఏపీ లో ఉన్న పరిస్థితుల గురించి చంద్రబాబు ను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని నందమూరి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. శుక్ర వారం అసెంబ్లీ నుంచి తెలుగు దేశం పార్టీ ఆఫీసుకు నారా చంద్రబాబు నాయుడు వచ్చారు.  ఈ సందర్భంగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించి…  మీడియా ముందే బోరున విలపించారు.

Read more RELATED
Recommended to you

Latest news