రేపు పిఠాపురంలో పర్యటించనున్న రామ్ చరణ్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న నేపథ్యంలో ఆయన గెలుపు కోసం టాలీవుడ్ నుంచి అనేకమంది స్వయంగా పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయితేజ్ వంటి హీరోలు ప్రచారం చేశారు. ఇక చిరంజీవి వీడియో సందేశం పంపించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు. అయితే రేపు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో తల్లి సురేఖతో కలిసి ప్రచారం చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు.శనివారం ఉదయం బయలుదేరి, 9 గంటల 30 నిమిషాలకు తల్లి సురేఖతో కలిసి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడ నుండి రాంచరణ్, సురేఖలు పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర ఆలయాన్ని సందర్శించనుకోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రచారం చేయనున్నారు. ముగిసిన తర్వాత వారు పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news