CM క్రిమినల్ మినిస్టర్ ..కెసిఆర్ పై రాములమ్మ వివాదాస్పద వ్యాఖ్యలు

-

CM క్రిమినల్ మినిస్టర్ అంటూ ..కెసిఆర్ పై రాములమ్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. కేసీఆర్ సర్కార్ పాలనలో లీకేజీ పేరుతో వ్యాపారం జరుగుతోందన్నారు.

లీకేజీ బయటపడేసరికి మాకు సంబంధం లేదని తండ్రీకొడుకులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఒక సాధారణ ఉద్యోగులు ఛైర్మన్ చాంబర్ కు వెళ్లి లీకేజీ చేయగలరా? అది అసాధ్యం అన్నారు. సంతోషంతో చేయడమే కేసీఆర్ పని అని.. ఆయనకు కావాల్సింది లాభమేనని కీలక ఆరోపణలు చేశారు.

లీకేజీతో పార్టీకి చెడ్డపేరు రావడంతో నిరుద్యోగుల ఫీజులు మాఫీ చే స్తాం, ఫ్రీ బువ్వ పెడతామంటున్నారు.. మీకేమైనా దిమాక్ ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బకొట్టిన మీరు.. నిరుద్యోగులకు ఫ్రీగా బువ్వ పెడతామంటారా? అని మండిపడ్డారు. గతంలో గ్లోబరీనా సంస్థ నిర్వాకంవల్ల చనిపోయిన పిల్లల ప్రాణాలు తీసుకొస్తారా? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news