రణ్‌బీర్‌ – అలియా ‘బ్రహ్మాస్త్ర’కు రెమ్యునరేషన్ తీసుకోలేదా?

-

రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనిరాయ్‌ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్‌ 9న విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. అయితే.. ఈ సినిమా బడ్జెట్‌, కలెక్షన్స్‌ విషయంలో రకరకాల రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

సినిమా బడ్జెట్‌ పెరిగిపోవడంతో.. అలియా, రణ్‌బీర్‌ ఇద్దరూ వారి పారితోషికాలను వదులుకున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా దర్శకుడు అయాన్‌ వీటిపై స్పందించారు. ‘‘చాలా మంది వ్యక్తిగత త్యాగాల వల్ల ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో నటించినందుకు రణ్‌బీర్‌ డబ్బులు తీసుకోలేదు. ఇది చాలా పెద్ద విషయం. ఇక అలియా విషయానికొస్తే తను ఈ ప్రాజెక్టులో 2014లో జాయిన్‌ అయ్యింది. అలియాకు ఈ సినిమా కోసం ఇచ్చిన పారితోషికం తను ఇప్పుడు తీసుకుంటున్న దానికి చాలా తక్కువ. మేము ఈ సినిమా పూర్తి చేసే సమయానికి అలియా కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది’’ అన్నారు.

ఇక రణ్‌బీర్‌ కపూర్ మాట్లాడుతూ..‘‘నేను బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి పారితోషికం తీసుకోలేదు. కానీ నేను అంతకు మించి పొందాను. ఒక నటుడిగా నేను ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు. ఈ సినిమా నిర్మాతల్లో రణ్‌బీర్‌ కపూర్‌ కూడా ఒకరన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version