కాంగ్రెస్ పార్టీ జెండా చేవెళ్లలో ఎగరాలి: రంజిత్ రెడ్డి

-

చేవెళ్ల గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య మండల పార్టీ ఉపాధ్యక్షుడు జీవన్ గౌడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలానే మాజీ సర్పంచ్ భర్త వెంకటేష్ గౌడ్ తో పాటు 200 మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రంజిత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

గత పది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం దొరల పాలనలో కొనసాగిందని గొప్పలు చెప్పడమే తప్ప అభివృద్ధి ఎక్కడా కనపడలేదని కాంగ్రెస్ పార్టీ భారీ ప్రభంజనంతో గెలిచిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్యారెంటీల పథకాలని రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news