స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏంటి ? : మంత్రి బొత్స

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజేపీ మద్దతిస్తుందా.. వ్యతిరేకిస్తుందా చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ మద్దతు ఇస్తుందా..? లేదా అనేది చెప్పిన తరువాతనే  విశాఖలో బీజేపీ పోటీ చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం అని బొత్స తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు.

ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి అంశంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక షార్ప్ షూటర్ కొట్టినట్లుగా జగన్ పై దాడి జరిగిందన్నారు. అలాంటి వారిని చంద్రబాబు ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు. జగన్ పై దాడి డ్రామా కాదని.. దాడికి ముందు రోజే చంద్రబాబు భాష అందరూ చూశారన్నారు. చంద్రబాబు భాషను ఖండిస్తున్నామన్నారు. సీఎం జగన్ పై దాడి జరిగితే పార్టీలకతీతంగా ఖండించారని, చంద్రబాబు, పవన్ మాత్రం వెటకారంగా మాట్లాడారు. డ్రామాలు చేయడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య అని, రాళ్లు వేయించుకునే అలవాటు ఆయనకే ఉండొచ్చని చెప్పారు. జగన్ యాక్టర్ కాదు.. రియల్ హీరో అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news