జగన్ వచ్చాక అత్యాచారాలు పెరిగిపోయాయి: చంద్రబాబు

-

ఈ మూర్ఖుడు జగన్ వచ్చాక రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. సీఎం సొంత జిల్లా ప్రొద్దుటూరులో ఓ ఎస్సీ మహిళను పదిమంది కలిసి అత్యాచారం చేస్తే పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో రోజుకో చోట ఇలాంటి అత్యాచార అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో గురువారం రెండో రోజు పర్యటనలో గుడుపల్లె మండలం లోని పొగురుపల్లె లో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుండడంతో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా పెంచుకోవాలని, ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరగడం సహజమని మహిళా మంత్రి చెప్పడం దారుణమని అన్నారు. బాబాయిని చంపగలిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. గోడ్దలి పోటును గుండెపోటు గా మార్చి చెప్పగలిగే నాయకుడు కూడా అతను ఒక్కటేనని చంద్రబాబు దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news