ప్రధాని మోడీపై రసమయి సంచలన వ్యాఖ్యలు.. గోధుమలు తినేవాడికేం తెలుసు ?

-

కరీంనగర్ జిల్లా : మానకొండూర్ లో మహా ధర్నాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గోధుమలు తినే ప్రధాని నరేంద్ర మోదీ అనేటోడికి వ్యవసాయం గురించి ఏమి తెలుసంటూ తీవ్ర పదజాలంతో మండి పడ్డారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.

అలాగే కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కూడా ఓ రేంజ్‌ లో ఆడుకున్నారు. కేంద్రం పెంపుడు కుక్క అంటూ బండి సంజయ్‌ పై వ్యాఖ్యలు చేశారు రసమయి. కేంద్ర ప్రభుత్వం దగ్గర భౌభౌ అని మొరుగుతాడంటూ బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు రసమయి బాలకిషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ.. రైతుల కోసం కోట్లాడే ప్రభుత్వం అన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ తో రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.

Read more RELATED
Recommended to you

Latest news