IPL ఆరంభ వేడుకల్లో తమన్నా, రష్మిక డ్యాన్స్.. పాటతో అదరగొట్టిన అర్జీత్ సింగ్

-

వేసవి సందడి షురూ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఐపీఎల్ -16 సీజన్ ఆరంభ వేడుకలు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సీనియర్​ నటి మందిరా బేడీ ఐపీఎల్‌ యాంకర్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది.  ఈ ఆరంభ వేడుకులకు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ప్రముఖ సింగర్​ అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించాడు. బ్రహ్మాస్త్ర సినిమాలని కేసరియా పాట పాడి ఆడియెన్స్ ను ఉత్సాహపరిచాడు. ఈ ఆరంభ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా హాజరయ్యారు.

 

ఇక హీరోయిన్​ రష్మిక మంధన్న, తమన్నా స్టేజ్​పై తెలుగు పాటలకు చిందులేసి జోష్ నింపారు. ‘పుష్ప’ సినిమాలోని ‘సామి సామీ’, ‘శ్రీ వల్లి’ పాటలకు అదిరిపోయే స్టెప్పులేసింది రష్మిక. ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు కూడా డ్యాన్స్ అదరగొట్టింది. మరో హీరోయిన్​ తమన్నా భాటియా.. వివిధ భాషల పాటలకు డ్యాన్స్​ చేస్తూ.. ప్రేక్షకుల్లో జోష్ నింపింది. ‘పుప్ప’లోని ‘ఊ అంటావా మావ’ పాటకు చిందులేసింది.

నందమూరి బాలకృష్ణ.. ఈ ఐపీఎల్ 2023 ఓపెనింగ్ మ్యాచ్ కోసం కామెంటేటర్ అవతారం ఎత్తారు. ఇందుకోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ బాక్స్​కు చేరుకున్నారు. ఓ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ కోసం బాలయ్య కామెంటేటర్​గా మారడం ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Latest news