రిషబ్ శెట్టి తో వివాదమే రష్మిక కొంప ముంచుతోందా..!!

-

సినిమా పరిశ్రమలో వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. హిట్ కొట్టిన రోజు 10 కార్లు ఇంటి ముందు వుంటాయి. అదే సమయంలో సినిమా ప్లాప్ అయితే మాత్రం ఎవరూ తిరిగి చూసే అవకాశం కూడా ఉండదు. పైపెచ్చు మాటలతో కుళ్ళ బొడుస్తారు. ఇది సినిమా పరిశ్రమలో అందరికీ పరిచయమే. దీనికి ప్రాంతీయ ఫీలింగ్ మరి కొంత ఆజ్యం పోసినట్లు చేస్తుంది.

ఇక విషయంలోకి వస్తే హీరోయిన్ రష్మిక కర్ణాటక స్వంత రాష్టం అని అందరకీ తెలిసిందే. మొదట కన్నడ నుండి తెలుగుకు వచ్చి మెల్లిగా ఒక్కో సినిమా చేసుకుంటా పుష్ప సినిమా తో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లి పొయింది. ఇక అమ్మడి చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పడు కర్నాటక లో ఆమె మీద విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇక ఆమె సినిమాలను బ్యాన్ చేయాల్సిందిగా టాక్ నడుస్తోంది.

వాస్తవానికి ఈ వివాదం కాంతారా కంటే మొదలయ్యింది అంటారు. కాంతారా తీసిన రిషబ్ శెట్టి రష్మిక ను తన సినిమా కిర్రిక్ పార్టీ ద్వారా పరిచయం చేసాడు. ఆ సినిమా తర్వాత ఆమె అతనితో మాట్లాడకుండా కృతజ్ఞతలు కూడా చూపించ లేదట. రిషిబ్ శెట్టి తీసిన కాంతారా సినిమాని అందరూ పొగుడుతున్నా కాని, కన్నడ హీరోయిన్ అయ్యి ఉండి కూడా ఇప్పటివరకు సినిమా చూడలేదని తాపీగా చెప్పడంతో కన్నడ ప్రజలు మండి పడుతున్నారు. అదీ కాక ఫేమ్ వచ్చిన తర్వాత కన్నడ సినిమా వైపు చూడటం లేదని ఆమె పై కోపంతో ఉన్నారట. దీనితో ఆమెను బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నారట. ఇక ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news