ఎన్టీఆర్ ను చంపినందుకు.. చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి శాపం పెట్టాడు – పేర్ని నాని

-

ఎన్టీఆర్ ను చంపినందుకు.. చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి శాపం పెట్టాడని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవే నాకు చివరి ఎన్నికలు అన్నాడు, ఇప్పుడు పోలవరం వెళ్ళి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని చురకలు అంటించారు. పాత కాలపు స్వామిజీల తంతు లా ఉందని.. చంద్రబాబుకు మైండ్ ఉందా?? అని నిలదీశారు.


ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారు.. మొన్నటి వరకు బాదుడే బాదుడు అన్నాడని మండిపడ్డారు. హెరిటేజ్ లో రేట్లు బాదుడే బాదుడు అని జనాలకు తెలియదా?? జనాలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా?? అని నిలదీశారు. చంద్రబాబును, లోకేష్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందట.. కాంతారావు సినిమా డైలాగులు ఇప్పుడూ వేస్తే ఎలాగ చంద్రబాబు?? అని ఫైర్ అయ్యారు. అంతా బాగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర చౌదరిగా కనిపించాడు చంద్రబాబుకు.. ఎన్టీఆర్ ను క్షోభ పెట్టి చంపినందుకు ఆయన పూజించే వెంకటేశ్వర స్వామి చంద్రబాబుకు శాపం పెట్టాడని ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news