టాలీవుడ్ నటుడు, విలన్ రవికిషన్ ఇంట తీవ్ర విషాదం

-

ప్రముఖ భోజ్ పురీ నటుడు.. టాలీవుడ్ విలన్ గా మెప్పించిన యాక్టర్ రవికిషన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో రవి కిషన్ అన్న రమేష్ కిషన్ మరణించారు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ కిషన్ బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రవి కిషన్. తన అన్న ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే అన్న మరణించడం తీవ్ర లోటని ఆయన అన్నారు. 

భోజ్ పురి, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో నటించారు. ప్రస్తుతం గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్నారు. బీజేపీ పార్టీలో నాయకుడిగా ఉన్నారు. తెలుగులో ‘ రేసు గుర్రం’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. మద్దాలి శివారెడ్డి క్యారెక్టర్ లో తన విలనిజాన్ని చూపించారు. రీసెంట్ గా ‘ హీరో ’ సినిమాలో కూడా చేశారు. రాజకీయాల్లో ఉంటూనే.. సినిమాల్లో నటిస్తున్నారు రవి కిషన్

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version